Friday, April 26, 2024

వివేక హత్యపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వైఎస్ వివేకానంద చనిపోతే దినం ఖర్చులు.. కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభం లేదని ఎపి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా చనిపోతే ఆస్తులు ఎవరికెళ్లాయి..? వివేకా చనిపోతే జగన్‌కేమైనా ఆస్తులొచ్చాయా.. అని ఆయన ప్రశ్నించారు. వివేకా జగన్‌తో కలిసి నడిచి వచ్చిన వ్యక్తి కాదని వెల్లడించారు. విజయమ్మ మీద కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడించే ప్రయత్నం చేశారు.

జగన్ కుటుంబం సర్వనాశనం కోరుకునే వ్యక్తులు వైఎస్ వివేకా కుటుంబంలో ఉన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబమే జగన్ వెంట నడిచారు.భాస్కర్ రెడ్డి కుటుంబానికే జగన్ టిక్కెట్టిస్తారు. టిక్కెట్ ఎవరికివ్వాలో జగన్ ఇష్టం అని నాని అన్నారు. వర్ల రామయ్య, పట్టాభి వంటి వాళ్లు చంద్రబాబు జీతగాళ్లు. మామను చంపి పదవి తీసుకుంది చంద్రబాబే. 40 ఏళ్లు రాజకీయం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News