Thursday, April 25, 2024

కరోనా బాధితులకు కోహ్లీ, అనుష్క దంపతుల సాయం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ-19)​పై దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఎంతో మంది సినీ, వ్యాపార, క్రీడా, ప్రజాప్రతినిధులు తమ వంతు సహాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందించడానికి ముందుకువస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క దంపతులు కూడా విరాళం ప్రకటించారు.”పిఎం-కేర్స్ నిధి, మహారాష్ట్ర సిఎం సహాయనిధికి నేను, అనుష్క కొంత సాయం చేస్తున్నాం. కరోనాతో చాలా మంది బాధపడుతుండడం మా హృదయాలను కలచివేస్తున్నది. కష్టాల్లో, బాధలో ఉన్న వారికి ఏదో విధంగా మా విరాళం సాయపడుతుందని ఆశిస్తున్నాం” అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. అయితే, ఎంత మొత్తం విరాళంగా ఇచ్చారన్నది కోహ్లీ వెల్లడించలేదు.

Kohli and Anushka donates for Corona Victims

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News