Wednesday, April 24, 2024

ఐసిసి టీమ్‌లో కోహ్లి, హార్దిక్, సూర్య..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) 2022 సంవత్సరానికి సంబంధించి ఎంపిక చేసిన అత్యుత్తమ టి20 జట్టులో ముగ్గురు భారత క్రికెటర్లు చోటు సంపాదించారు. విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యలకు ఐసిసి టీమ్‌లో స్థానం దక్కింది. జోస్ బట్లర్ (ఇంగ్లండ్) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

2022లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ల నుంచి 11 మందితో కూడిన జట్టును ఐసిసి ప్రకటించింది. దీనిలో భారత్ నుంచి ముగ్గురికి చోటు లభించింది. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), సికిందర్ రజా(జింబాబ్వే), గ్లెన్ ఫిలిప్స్ (కివీస్), హారిస్ రవూఫ్ (పాక్), హసరంగ (శ్రీలంక), శామ్ కరన్ (ఇంగ్లండ్), జోస్ లిటిల్ (ఐర్లాండ్)లు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక మహిళల జట్టులో స్మృతి మంధాన, దీప్తి శర్మ, రిచా ఘోష్‌లకు చోటు లభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News