Wednesday, April 24, 2024

ప్రధాని మోడీతో ముగిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని మోడీతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ ముగిసింది. మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 గంటల వరకు 10 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే సమావేశానికి ముందు మాట్లాడుతూ, ప్రధానిని కలవబోతుండటం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెంకటరెడ్డి చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించేందుకే ప్రధానిని కలుస్తున్నానని అన్నారు.

మూసీ నది ప్రక్షాళనకు రూ. 3 వేల కోట్లు ఇవ్వాలని కోరనున్నట్టు తెలిపారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు ఇతర పనులకు నిధులను మంజూరు చేయాలని కోరుతానని తెలిపారు. మోడీతో సమావేశం వివరాలను మీడియాతో కోమటిరెడ్డి పంచుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News