Friday, March 29, 2024

కొంపల్లిలో కారును ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని కొంపల్లిలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి ట్రాఫిక్ సిగ్నల్స్ ఐ20 కారును ఎదురుగా వచ్చి లారీ ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కొంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో లారీ క్లీనర్ కంటైనర్ ను నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News