Saturday, April 20, 2024

ఉద్యమ వారసత్వానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతీక: గంగుల

- Advertisement -
- Advertisement -

 కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నివాళులు అర్పించిన మంత్రి గంగుల కమలాకర్

నిజాం వ్యతిరేక, తొలి దశ ఉద్యమాల్లో బాపూజీ పోరాటం స్పూర్తి దాయకం

అతి సామాన్య కుటుంబం నుండి ఎదిగిన మహోన్నత వ్యక్తిత్వం బాపూజీది

మలిదశ పోరాటానికి వేదికగా కెసిఆర్ గారి సారథ్యంలో తన ఇల్లు జలదృశ్యాన్ని మలిచిన దీశాలి

సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంది

కొండా లక్ష్మణ్ బాపూజీ పేర హార్టీకల్చర్ యూనివర్శిటీ స్థాపించిన ప్రభుత్వం

బాపూజీ సేవల్ని స్మరించుకున్న మంత్రి గంగుల

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవల్ని స్మరించుకున్న, బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, బిసి సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం

Konda Lakshman Bapuji symbol of telangana movement

హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఘనమైన ఉద్యమ వారసత్వానికి ప్రతీక అని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అని తెలిపారు.  ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి గంగుల పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంగళవారం హైదరాబాద్ ఖైరతాబాద్ లోని మంత్రి కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. బాపూజీ సేవల్ని స్మరించుకొన్నారని, సమాజం బాపూజీ అని గౌరవంతో పిలుచుకొనే మహోన్నత వ్యక్తి అని, కొమరంభీం జిల్లా వాంకిడిలో సాధారణ వెనుకబడిన కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించారని పొగిడారు.

నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసారన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు నాటి తొలిదశ తెలంగాణ విముక్తి ఉద్యమంలో వలసపాలనపై తీవ్ర నిరశన తెలియజేసి 1969లో తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రశంసించారు. అనంతరం మలిదశ ఉద్యమంలోనూ నాటి ఉద్యమ సారథి సిఎ కెసిఆర్ కు అండగా ఉండి, తన ఇళ్లును జలదృశ్య ఉద్యమ వేదికగా మలిచి స్పూర్తిని అందించారని గంగుల కొనియాడారు. దీన్ని తట్టుకోలేక 2002లో నాటి వలస ప్రభుత్వం జలద్రుశ్యాన్ని నేలమట్టం చేస్తే న్యాయపోరాటం చేసి విజయం సాధించారన్నారు. 21 సెప్టెంబర్ 2012లో పరమపదించే వరకూ కొండా లక్ష్మణ్ బాపూజీ వెనుకబడిన వర్గాల సమున్నతి కోసం విశేషమైన కృషిచేసి, తన సేవానిరతి ద్వారా నిరంతరం తెలంగాణ సమాజానికి స్పూర్తినిస్తూనే ఉన్నారన్నారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యంలోని ప్రభుత్వం ఆ మహానీయున్ని ఘనంగా స్మరించుకుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ హర్టీకల్చర్ యూనివర్శిటీని ఆయన పేర ఏర్పాటు చేసుకున్నామన్నారు. బిసిల అభ్యున్నతి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద్ పటేల్, ఉపేంద్ర, బిసి సంక్షేమ శాఖ ప్రిన్షిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బిసి కార్పోరేషన్ ఎండి అలోక్ కుమార్, బిసి సంక్షేమశాఖ జెడి చంద్రశేఖర్ ఇతర బిసి సంక్షేమ శాఖ అధికారులు, బిసి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News