Tuesday, April 23, 2024

మనమందరం గర్వపడే సినిమా

- Advertisement -
- Advertisement -

Konda polam pre release event

 

వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘కొండపొలం’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ఓబులమ్మ పాటను చూసినప్పటి నుంచి రకుల్‌ను ఆ పాత్రలో చూస్తున్నాను. ఇది గొప్ప చిత్రం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇంకా మంచి నవలను రాయాలి. దాన్ని మేం సినిమాగా తీసేందుకు రెడీగా ఉంటాం” అని పేర్కొన్నారు. క్రిష్ మాట్లాడుతూ “కొండపొలం పుస్తకం చదివిన తరువాత.. అందులో స్త్రీ పాత్ర లేదు.

గొర్రెలు కాసేందుకు అడవికి వెళ్లిన కుర్రాడు.. మళ్లీ అదే అడవిని కాపాడే అధికారిగా వస్తాడు. అలాంటి స్టోరీలో అందమైన ప్రేమకథను జోడించి తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్నాను. మళ్లీ సినిమా కోసం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో కథ రాయించాను. స్క్రీన్ ప్లే మాత్రమే నేను రాశాను. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్‌కు బెంచ్ మార్క్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో అంతకంటే పై మెట్టు ఎక్కిస్తున్నాను. ఇది మనమందరం గర్వపడే సినిమా” అని అన్నారు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “అడవి పెద్ద బాలశిక్ష అంటారు. ‘ఉప్పెన’ నా మొదటి చాప్టర్ అయితే.. ‘కొండపొలం’ రెండోది. ఈ చిత్రం ద్వారా అందరినీ గమనిస్తూ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని నేర్చుకున్నాను. ఎన్నో కష్టాలు పడి.. పులిని ఎదురించడమే ఈ కొండపొలం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రకుల్‌ప్రీత్ సింగ్, రాజీవ్ రెడ్డి, లక్ష్మీకాంత్, బుచ్చిబాబు సానా, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, హేమ, సాయి చంద్, చంద్రబోస్, రచ్చ రవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News