Thursday, April 25, 2024

ఫ్రెష్‌గా, కొత్తగా…

- Advertisement -
- Advertisement -

Kondapolam movie trailer release

 

‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రం ‘కొండపొలం’తో మరోసారి అందరినీ అలరించేందుకు సిద్ధమయ్యారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. సోమవారం నాడు ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో సినిమా కథ ఏంటి? దేని గురించి చెప్పబోతోన్నారు? అనే క్లారిటీని ఇచ్చారు. కటారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) తన తాత మాట ప్రకారం.. తండ్రితో కలిసి కొండపొలం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ నీటి వసతి ఉండదు. కానీ అక్కడే మేకలు, గొర్రెలను పెంచాలి. క్రూర మృగాల నుంచి వాటిని కాపాడే బాధ్యతను అతను తీసుకుంటాడు.

ఇక అక్కడే అతనికి ప్రేయసి ఓబులమ్మ పరియమవుతుంది. ఇక అడవిలో క్రూర మృగాల కంటే ఘోరమైన, దారుణమైన మనుషులుంటారు. వారి వల్ల రవీంద్ర ప్రయాణం ఎంతో కష్టంగా మారుతుంది. వారితో రవీంద్రకు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అనేదే కథ. వైష్ణవ్ తేజ్‌కు ఈ పాత్ర సరిగ్గా సరిపోయింది. ఇక రకుల్‌ప్రీత్ సింగ్ ఎంతో అందంగా కనిపించింది. ఈ జంట చూడటానికి ఎంతో ఫ్రెష్‌గా, కొత్తగా ఉంది. సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన నవల నుంచి ఈ కథను తీసుకున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొండపొలం చిత్రం అక్టోబర్ 8న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News