Friday, April 19, 2024

భారత్ నుంచి వచ్చే వైరసే ప్రమాదకరం

- Advertisement -
- Advertisement -

KP Sharma Oli has made serious comments on India

 

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వ్యాఖ్యలు

ఖాట్మాండూ : లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య వివాదం నెలకొన్న తరుణంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వచ్చే వాళ్ల వల్లే తమ దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ప్రబలుతోందని ఆరోపించారు. భారత్ నుంచి వచ్చే వైరస్ చైనీస్, ఇటాలియన్ వైరస్ కంటే మరింత ప్రాణాంతకమైనదని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్‌లో ప్రసంగించిన కేపీ శర్మ.. “భారత్ నుంచి అక్రమ మార్గాల ద్వారా ఇక్కడి వచ్చిన వారు దేశంలో వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కొంతమంది రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి పరీక్షలు నిర్వహించకుండానే వారిని లోపలికి తీసుకువస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News