Friday, April 26, 2024

కూకట్‌పల్లిలో కృతిశెట్టి సందడి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కూకట్‌పల్లి: దసరా సందర్భంగా నాకు షాపింగ్ చేయాలని ఉందని ప్రముఖ సినీతార ‘ఉప్పెన’ ఫేం కృతిశెట్టి అన్నారు. శనివారం కూకట్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన జె.సి.బ్రదర్స్ షాపింగ్‌మాల్‌ను కృతిశెట్టి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కస్టమర్ల సౌకర్యార్థం సువిశాల ప్రాంగణంలో కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రతి ఒక్కరికి నచ్చేలా వివిధ రకాల వస్త్రాలను అతి తక్కువ ధరలతో జె.సి.బ్రదర్స్ అందుబాటులో ఉంచిందన్నారు. రానున్న దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని జె.సి.బ్రదర్స్ అందజేస్తున్న సరికొత్త కాంబో ఆఫర్లను కస్టమర్లు వినియోగించు కోవాలన్నారు. వివిధ రకాల వస్త్రాలను చూస్తే తనకు వెంటనే షాపింగ్ చేయాలని కోరిక కలుగుతుందని తెలిపారు. కస్టమర్లు ఒక్కసారైనా జె.సి.బ్రదర్స్‌ను సందర్శించి పట్టు, డిజైనర్, ఫ్యాన్సీ, కాటన్ శారీస్, సల్వార్ సూట్స్, గాఘ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్‌ల ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్లను సొంతం చేసుకోవాలని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.

Krithi Shetty inaugurates JC Brothers Shopping Mall

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News