Thursday, March 28, 2024

సేవాదినంగా నా బర్త్‌డే

- Advertisement -
- Advertisement -

 

24న దివ్యాంగులకు 100త్రిచక్ర వాహనాలు

బొకేలు, కేక్‌లు, ప్రకటనలకు బదులు ఆ సొమ్ముతో ఇతరులకు సాయం చేయండి
ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటండి
అభిమానులకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: ఈనెల 24న తన జన్మదినం నాడు బొకేలు, కేకులు, హోర్డింగులు, ప్రకటనలు కాకుండా ఆ సొమ్ముతో తమకు తోచినట్టు ఇతరులకు సహాయం అదించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అభిమానులకు మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే తన పుట్టిన రోజు సందర్భంగా తన పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమం లో భాగంగా కనీసం ఒక మొక్కను నాటాలని మంత్రి కెటిఆర్ పిలుపు నిచ్చారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వికలాంగులకు 100 త్రిచక్రవాహనాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంత్రి కెటిఆర్ బాటలోనే వికాలంగులకు త్రిచక్ర వాహనాలు అందించేందుకు ముందుకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గత జన్మదిన వేడకలలో అంబులెన్సులను అందించామని, ఈసారి తాను స్వయంగా 100 మోటరైస్డ్ త్రిచక్ర వాహనాలను వికలాంగులకు అందిస్తానని తెలిపారు. కాగా గిఫ్ట్ ఏ స్త్మ్రల్ కార్యక్రమంలో పాల్గొని కెటిఆర్ జన్మదిన సందర్భంగా తాము సైతం భాగస్వాములను అవుతామని పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ నాయకులు, అభిమానులు ప్రకటించారు.
కెటిఆర్ పిలుపునకు భారీ స్పందన ః
మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. ఎంఎల్‌సి నవీన్ రావు 100, ఎమ్మెల్సీలు శంబిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెరో 60, మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ చెరో 50, ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు గాదరి కిషోర్ 20, త్రిచక్ర వాహనాలను కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, శానంపూడి సైదిరెడ్డి, జీవన్ రెడ్డి పలువురు తమ వ్యక్తిగత స్థాయిలో త్రిచక్ర వాహనాలను అందిస్తామని ముందకు వచ్చారు.

KTR Calls to plants sapling on his Birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News