Friday, March 29, 2024

అదానీ కంపెనీల మోసంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు కెటిఆర్ సవాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అదానీ గ్రూపు కంపెనీల కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి), సిబిఐ, ఆదాయం పన్ను శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబి) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం సవాలు విసిరారు. అదానీ గ్రూపు కంపెనీలు లావాదేవీలలో అక్రమాలు, మోసాలు జరిగినట్లు అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిసెర్చ్ జరిపిన దర్యాప్తు నివేదిక బయటపెట్టిన కొద్ది గంటలకే కెటిఆర్ ఈ సవాలు విసిరారు.

ఇడి, సిబిఐ, ఐటి, సెబి&హై దమ్ ప్రోబ్ కర్నే కా? విఅంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు. అంతేగాక.. ప్రధాన స్రవంతిలోని జాతీయ మీడియా ఈ నివేదికను ప్రచురించడం లేదా చర్చించడం వంటివి చేయబోవని తాను కచ్ఛితంగా చెప్పగలనని, సామాజిక మాధ్యమాల నుంచి సైతం ఈ నివేదికను తొలగించడానికి కేంద్రంలోని ఎన్‌పిఎ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News