- Advertisement -
యాదాద్రి భువనగిరి : భువనగిరి ఎంఎల్ఎ పైళ్ల శేఖర్ రెడ్డి సేవా గుణాన్ని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసలు గుప్పించారు. తెలంగాణలో కరోనా మహమ్మారి పెరుగుతున్న క్రమంలో తన నియోజకవర్గ ప్రజలకు నేనున్నానంటూ పైళ్ల శేఖర్ రెడ్డి భరోసా కల్పించారు. సర్కార్ నిధులతో పాటు దాదాపు రూ.50 లక్షల సొంత ఖర్చులు వెచ్చించి బిబినగర్ లోని ఎయిమ్స్ లో 50 పడకలతో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు మంత్రి కెటిఆర్ సైతం ట్విట్టర్ వేదికగా ఎంఎల్ఎను అభినందించారు.
- Advertisement -