Friday, March 29, 2024

కల్నల్ సంతోష్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR inaugurate Colonel Santosh babu statue in Suryapet

సూర్యాపేట: జిల్లా పట్టణంలో అమర జవాను కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు విరోచితంగా పోరాడి అమరడైన విషయం తెలిసిందే. మంగళవారం సూర్యాపేట జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కెటిఆర్ పట్టణంలోని కోర్ట్ చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల‌ కాంస్య విగ్రహాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ బాబు కుటుంబ సభ్యులతోపాటు జిల్లా నేతలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు.

KTR inaugurate Colonel Santosh babu statue in Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News