Saturday, April 20, 2024

బైరామ‌ల్‌గూడ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR inaugurated Bairamalguda RHS flyover

హైదరాబాద్: నగరంలోని బైరామ‌ల్‌గూడ వద్ద నిర్మించిన ఫ్లైఓవ‌ర్‌ను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సోమవారం ప్రారంభించారు. దీంతో న‌గ‌రంలో మ‌రో ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఫ్లైఓవ‌ర్‌ను ఎస్ఆర్డీపీ ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్ల వ్య‌యంతో జిహెచ్ఎంసి నిర్మిస్తోంది. ఎస్టీఆర్పీ ప్యాకేజీ-2లో భాగంగా ఎల్బీనగర్ లో నియోజకవర్గంలో రూ. 448 కోట్ల ఖర్చుతో చేపట్టిన 14 పనుల్లో ఇప్పటికే 6 పూర్త‌య్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ వంతెన నిర్మాణానికి ప్రత్యేక టెక్నాలజీ వాడామని జిహెచ్ఎంసి అధికారులు పేర్కొన్నారు. ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్సవానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు ప‌లువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News