Friday, March 29, 2024

ఎస్సి, ఎస్టీలకు రూ.100 కోట్ల సబ్సీడి నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

KTR Inaugurates SC and ST Commission Office

హైదరాబాద్: ఎస్సి, ఎస్టీ కమిషన్ వెబ్ సైట్, కాన్ఫరెన్స్ హాల్ ను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సి, ఎస్టీలకు రూ.100 కోట్ల సబ్సీడి నిధులను మంత్రి కెటిఆర్ విడుదల చేశారు. దేశంలోనే అత్యుత్తమ పాలసీలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని కెటిఆర్ అన్నారు. ఎస్సి కమిషన్ పనితీరు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కెటిఆర్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం దళిత, గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దేశంలో మూలధనంతోనే కులాన్ని రూపుమాపే అవకాశం ఉందని.. దళిత, గిరిజన యువకులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే టీ ప్రైడ్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున దళిత, గిరిజన యువకులకు అవకాశాలు కల్పిస్తున్నామని కెటిఆర్ తెలిపారు.

KTR Inaugurates SC and ST Commission Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News