Thursday, April 18, 2024

గద్వాల పర్యటన: బృందావన్ గార్డెన్ పనులకు కెటిఆర్ శంకుస్థాపన..

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల: జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సందర్భంగా జూరాల డ్యామ్ దగ్గర రూ.15.5 కోట్లతో చేపట్టనున్న బృందావన్ గార్డెన్ పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశాడు. అంతకుముందు అలంపూర్ చౌర‌స్తాలోని మార్కెట్ యార్డు ఆవ‌ర‌ణ‌లో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రికి కెటిఆర్ భూమి పూజ చేశారు. ఈ పర్యటనలో కెటిఆర్ తోపాటు మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అబ్ర‌హం, ఎంపి రాములు, ఎమ్మెల్సీ సుర‌భి వాణీదేవి త‌దిత‌రులు పాల్గొన్నారు.

KTR lays foundation stone to brindavan Garden at Jurala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News