డిజిపిని ఆదేశించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: నటి మీరా చోప్రాను సోషల్ మీడియాలో వేధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డిని రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. సోషల్ మీడియాలో తమకు ఎదురవుతున్న వేధింపులను, సమస్యలను ట్విట్టర్ వేదికగా నటి మీరా చోప్రా కెటిఆర్కు ఫిర్యాదు చేశారు. గతకొద్ది కాలంగా సోషల్మీడియాలో జూనియర్ ఎన్టిఆర్ అభిమానుల పేరుతో తనపై బూతుకామెంట్లను, అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కెటిఆర్కు, హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఆమె ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కలిస్తారని నమ్ముతున్నట్లు మీరా చోప్రా పేర్కొన్నారు. ఈ ట్విట్టర్కు తక్షణం స్పందించిన కెటిఆర్ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన కెటిఆర్కు మీరా చోప్రా ధన్యవాదాలు తెలిపారు.