Thursday, March 28, 2024

వెయ్యి కోట్ల కొత్త పెట్టుబడి

- Advertisement -
- Advertisement -
KTR participates in MOU signing ceremony
2వేల మందికి ఉద్యోగావకాశాలు
జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టం ఫెసిలిటీ కోసం
వెమ్ టెక్నాలజీతో ఎంఒయుపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు
తెలంగాణ డిఫెన్స్, ఏరో స్పేస్ రంగంలో వెమ్ కొత్త చరిత్ర :
ఐటి శాఖ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెడ్తున్న వెమ్ టెక్నాలజీకి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సమీకృత రక్షణ వ్యవస్థ సౌకర్యం (ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ) వల్ల రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. జహీరాబాద్‌లో సమీకృత రక్షణ వ్యవస్థ సౌకర్యం కోసం వెమ్ టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది.- ఈ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, నీతి అయోగ్ మెంబర్ డాక్టర్ వికె సరస్వథ్, డిఆర్‌డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి, ఐటి సెక్రటరీ జయేష్ రంజన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ వెమ్ టెక్నాలజీ ఎండి వెంకటరాజు స్టార్టప్ సంస్థలకి, ఎంఎస్‌ఎంఈలకు ఆదర్శంగా నిలుస్తారని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ప్రతి కంపెనీకి, టాలెంట్ ఉన్న వివిధ స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడంతో పాటు చేయూత అందిస్తుందన్నారు. తెలంగాణ డిఫెన్స్, ఏరో స్పేస్ రంగంలో వెమ్ కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ సంస్థ వెమ్ టెక్నాలజీ మంత్రి కెటిఆర్ కొనియాడారు. డిఫెన్స్ రంగంలో వెమ్ టెక్నాలజీ అందిస్తున్న సేవల పట్ల మంత్రి ధన్యవాదాలు తెలిపారు.- జహీరాబాద్ లో స్కిల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News