టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దిశా నిర్దేశం…
వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల నేతలతో భేటీ మంత్రి కేటీఆర్ గారి సమావేశం.
మంత్రి కెటిఆర్ తో పాటు సమావేశంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ.
హైదరాబాద్: ఈ నెల 25న జరిగే టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపైన వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ సమావేశం కావడంతోపాటు దిశానిర్దేశం చేశారు. జనగాం, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, ములుగు అసెంబ్లీ నియోజక వర్గాల నేతలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రి కె. తారక రామారావుతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.