Friday, March 29, 2024

తెలంగాణ ప్రజానీకానికి ‘దీక్షా దివస్’ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

KTR Says Happy Initiation Day to the people of Telangana

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అమరణ నిరహారదీక్ష చేపట్టి నేటితో 11 ఏండ్లు పూర్తి అయ్యాయి. ఆ అపూర్వ ఘట్టాన్ని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గుర్తుచేసుకున్నారు. యావత్ తెలంగాణ ప్రజలకు ట్విట్టర్ ద్వారా కెటిఆర్ ‘దీక్షా దివస్’ శుభాకాంక్షలు తెలిపారు. ‘నవంబర్ 29’ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టమన్నారు. కెసిఆర్ చేపట్టిన అమరణ దీక్ష యావత్ తెలంగాణ ప్రజలను, అన్ని వర్గాలను ఏకం చేసిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యమ నేతగా ఉన్న కెసిఆర్ 29 నవంబరు 2009న ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News