Friday, March 29, 2024

టిఆర్ఎస్ గెలుపు తెలంగాణ ప్రజల విజయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల ఆమెదం దక్కిందని, టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసే ప్రజలు ఓటేశారని మంత్రి అన్నారు. ఈ విజయంతో ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి పునరంకితం అవుతామన్నారు. మున్సిపల్ ఫలితాలు చూసైనా ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని అశిస్తున్నాని అన్నారు. టిఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్ కు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

KTR says Thanks to Telangana People for winning TRS

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News