- Advertisement -
రాజన్న సిరిసిల్ల: రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కెటిఆర్ కొనియాడారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయజెండాను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నామని, ఎన్నడూ లేని విధంగా సిరిసిల్ల మెట్ట ప్రాంతంలో రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందని, రెండో హరిత విప్లవానికి సిఎం కెసిఆర్ నాంది పలికారని మెచ్చుకున్నారు. వేసవిలో కూడా అప్పర్ మానేరు ప్రాజెక్టు మత్తడి దూకుతోందని, ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడుతున్నాయని, అటవీ అధికారులతో సమన్వయం చేసుకొని, అటవీ భూముల సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. సిరిసిల్ల రైతులకు అధునాతన మార్కెట్ యార్డు నిర్మించామన్నారు.
- Advertisement -