Friday, March 29, 2024

కరోనాతో కర్నూలు సిఐ మృతి

- Advertisement -
- Advertisement -

 

Kurnool CI dead with corona virus
అమరావతి: కరోనా వైరస్‌తో సిఐ రాజశేఖర్ (47) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కర్నూల్‌లో ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్‌కు కరోనా వైరస్ సోకడంతో ఐసోలేషన్ కు తరలించారు. అతడికి మధుమేహ వ్యాధితో ఉండడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు వెంటనే అతడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూశాడు. రాజశేఖర్ 1995లో ఎస్‌ఐ నియమితులయ్యాడు. ఎస్‌ఐగా ఉన్నప్పుడు అనంతపురంలో ఎక్కువగా విధులు నిర్వహించాడు. సిఐగా ప్రమోషన్ వచ్చిన కర్నూలుకు బదిలీ అయ్యారు. రాజశేఖర్ మృతి పట్ల కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపి గోరంట్ల మాధవ్, ఎంఎల్‌ఎ అనంత వెంకట్రామి రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తన సమకాలికుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని గోరంట్ల మాధవ్ గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య 33 వేలకు చేరుకోగా 408 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 24 వేల మంది కోలుకోగా 12 వేల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News