- Advertisement -
హైదరాబాద్ : ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సినీ నటుడు అర్జున్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన సినీనటి కుష్బూ బంజారాహిల్స్లోని రాజుబీఎన్ఆర్ కాలనీలో ఉన్న మున్సిపల్ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సినీ నటీమణులు మీనా, సుహాసిని, డ్యాన్స్ మాస్టర్ బృందకు కుష్బూ గ్రీన్ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ ఎంపి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మంచి ఆలోచన అని ఆమె పేర్కొన్నారు. అందరూ ఇలాగే ఆలోచిస్తే పర్యావరణానికి మేలు చేసిన వాళ్లమవుతామన్నారు. ఈ ఛాలెంజ్ మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని భవిష్యత్ తరాలకు మంచి జీవితం అందించే బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎమ్మెల్యే, నటి రోజా గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Kushboo who planted the plants
- Advertisement -