- Advertisement -
పర్యాటక ప్రాంతంగా ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకున్న ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు కొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. సరస్సు వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన జిప్ సైకిలింగ్ పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. మరో రెండు మూడు రోజుల్లో పర్యాటకులకు అందుబాటులో రానుంది. అంతేకాకుండా సరస్సులో సైకిల్ తొక్కుతూ బోట్ నడిపించేలా నూతన బోట్ సైకిలింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ దృశ్యాలను ‘మనతెలంగాణ’ కెమెరా శనివారం బంధించింది.
- Advertisement -