Friday, March 29, 2024

ఆ పాయింట్ ఆకట్టుకుంటుంది

- Advertisement -
- Advertisement -

Lakshya movie
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగశౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సిని మాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సో నాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పి.రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుద ల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత నారాయణ్ దాస్ కే నారం గ్, పి.రామ్‌మో హన్ రావు మీడియాతో మాట్లాడుతూ “ఆర్చరీ బేస్డ్ సినిమాలు ఇంత వరకు రాలేదు. ‘లక్ష’ సినిమాలో ఆ పాయింట్ అందరినీ ఆకట్టుకుం టుంది. మొదట ఈ కథ విన్నప్పుడు కొద్దిగా భయపడాము. కానీ పూర్తి గా కథ విన్నాక చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఆటతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కథ విన్న వెంటనే నాగశౌర్య ఈ సిని మా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ తరువాత నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్ మెంట్స్ శరత్ మరార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లు, ఓవర్సీస్‌లో 100 థియేటర్లలో లక్ష్య సినిమా ను విడుదల చేయబోతోన్నాం. ఈ సినిమాలో నాగశౌర్య, కేతిక శర్మ చా లా బాగా నటించారు. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో ఓ సిని మా, శివ కార్తికేయన్‌తో ఒక సినిమా, సుధీర్ బాబు హీరోగా హర్షవర్దన్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాము. రంజిత్ దర్శకత్వంలో గౌతమ్, విజయ్ సేతుపతి, సందీప్ కిషన్‌ల కాంబినేషన్‌లో మరో సినిమా, నాగా ర్జునతో ఓ సినిమాను చేస్తున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News