Thursday, April 25, 2024

బారాముల్లా ఎన్‌కౌంటర్: లష్కరే కమాండర్ హతం

- Advertisement -
- Advertisement -

Lashkar commander killed in Baramulla encounter

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని సొపోరేలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం రాత్రి చాలా పొద్దుపోయిన తరువాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతులు అయ్యారు. మృతులలో ఒకరు లష్కరే అత్యున్నత స్థాయి దళనేత అని శుక్రవారం పోలీసు అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని ఉగ్రవాద ఉనికి ప్రాంతం అయిన సొపోరేలో ఎదురుకాల్పులు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే నిఘా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ దశలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. మృతులు లష్కరే ఉగ్రవాదులే అని నిర్థారణ అయిందని, హతులలో ఒకరిని లష్కరే టాప్ కమాండర్ ఫయాజ్ అహ్మద్ వార్ అలియాస్ రుకానా అని, వార్పోరా నివాసి అని తేల్చారు, మరో టెర్రరిస్టు షహీన్ అహ్మద్ మీర్ అలియాస్ షహీన్ మోల్వీ అని గుర్తించారు. ఇప్పుడు మృతి చెందిన దళ నేత 2008 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలలో మునిగి ఉన్నాడని వెల్లడైంది.

Lashkar commander killed in Baramulla encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News