’అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది అందాల తార లావణ్య త్రిపాఠి. తొలి సినిమాలోనే నటనకు ప్రాధాన్యం ఉన్న ఉన్న పాత్రలో నటించిన ఈ బ్యూటీ అభినయం, అందమైన రూపం ఆకట్టుకుంది. ఈ క్రమంలో లావణ్య నటించిన భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గతేడాది వచ్చిన ’అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ తో పాటు గ్లామర్ రోల్స్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ డెహ్రాడూన్ బ్యూటీ.. ఫోటోషూట్స్ తో హల్చల్ చేస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా మధ్యమాలలో అరుదైన ఫీట్ అందుకుంది. తాజాగా లావణ్య ఇన్స్టాగ్రామ్లో 2 మిలియన్ ఫాలోవర్స్ని క్రాస్ అయింది. ఇప్పటికే ట్విట్టర్లో మిలియన్కి పైగా ఫాలోవర్స్ ఉన్న లావణ్యను ఫేస్బుక్లో 2.6 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఈమధ్య ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ని ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఈ మైల్ స్టోన్ని చేరుకుంది. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి.. సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్సప్రెస్’, కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ’చావు కబురు చల్లగా’ సినిమాలో లావణ్య యంగ్ విడో మల్లికగా నటించనుంది. ’ఏ1 ఎక్సప్రెస్’ లో హాకీ ప్లేయర్గా కనిపించనుంది.