మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడేళ్ల ఎల్ఎల్బి, ఐదేళ్ల ఎల్ఎల్బి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పిజిఎల్సెట్ ఫలితాలు శుక్రవారం(నవంబర్6) విడుదల కానున్నాయి. ఈ నెల 9వ తేదీన జరిగిన లాసెట్, పిజిఎల్సెట్ పరీక్షలకు మొత్తం 30,310 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 21,520 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో 63, ఆంధ్రప్రదేశ్లో 4 పరీక్షా కేంద్రాలలో లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఫలితాలు విడుదలైన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది. ఈ సారి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎంలో హ్యుమన్రైట్స్, క్రిమినాలజి స్పెషలైజేనేషన్లు అందుబాటులో తీసుకువచ్చారు. గత ఏడాది సీట్లకు అదనంగా ఈ ఏడాది ఈ కొత్త స్పెషలైజేషన్లలో 40 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దాంతో ఈ ఏడాది మొత్తం 4,172 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అందులో మూడేళ్ల ఎల్ఎల్బిలో 2,830 సీట్లు, ఐదేళ్ల ఎల్ఎల్బిలో 789, ఎల్ఎల్ఎంలో 553 సీట్లు ఉన్నాయి.