Friday, April 26, 2024

కరోనాకు ఓ లాయర్ కుటుంబం బలి

- Advertisement -
- Advertisement -

Lawyer family deceased with Corona

 

విజయవాడ: కరోనా మహమ్మారి అంతకంతకు వ్యాపిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. కరోనా నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ ఇంత వరకు రాలేదు. విజయవాడలో న్యాయవాది సుల్తాన్ ముసావీ కుటుంబాన్ని కరోనా కబళించింది. నెల రోజుల్లో కరోనా బారినపడి నలుగురు ప్రాణాలను కోల్పోయారు. అక్టోబర్ 8న న్యాయవాది తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. అక్టోబర్ 30న న్యాయవాది భార్య కూడా కొవిడ్ కారణంగా కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను మచిలీపట్నంలో నిర్వహిస్తున్న సమయంలోనే న్యాయవాది ముసావీ కూడా తుదిశ్వాస విడిచారు. కాగా, న్యాయవాది కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న సమయంలో అతను కూడా మరణించారు. కుటుంబం మొత్తం కరోనాతో మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News