- Advertisement -
మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేటలో చిరుత హల్చల్ చేసింది. రాజాపేట తండాలోని రైతు పొలంలో చిరుత గురువారం ఉదయం కనిపించింది. పొలం రక్షణ కోసం వేసిన కంచెలో చిక్కుకుంది చిరుత. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు చిరుతను కంచె నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే చిరుత ఇద్దరు సిబ్బందిపై దాడి చేసింది. ఈ దాడిలో వారు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయినా ధైర్యంగా ముందడుగు వేసిన ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు చిరుతును బోనులో బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.
Leopard Hulchul In Nalgonda District
- Advertisement -