Friday, March 29, 2024

తల్లి దగ్గర పడుకున్న 3 ఏళ్ల బాబును లాక్కెళ్లిన చిరుత….

- Advertisement -
- Advertisement -

Woman died after leopard attack at home

బెంగళూరు: నడి రాత్రి తల్లి దగ్గర పడుకున్న మూడేళ బాబును చిరుత పులి నోట కరుచుకొని వెళ్లి… సగం మృతదేహాన్ని తినేసిన సంఘటన కర్నాటకలోని రామానగరా జిల్లాలో చోటుచేసుకుంది. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. కుంబాలాగోడు ప్రాంతం దొడ్డేరి గ్రామంలో మంగళ గౌరీ, చంద్రప్పా అనే దంపతులకు హేమంత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వేసవి కాలం కావడంతో మెయిన్ డోర్ ఓపెన్ చేసి కుమారుడితో తల్లి పడుకుంది. చిరుత పులి వాళ్ల ఇంట్లోకి వెళ్లి బాబును నోట కరుచుకొని గ్రామ శివారులోకి వెళ్లిపోయింది. శనివారం తెల్లవారుజామున తన వడిలో పడుకున్న కుమారుడు లేడని గౌరీ తన భర్తకు తెలిపింది. వెంటనే దంపతులు గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో గ్రామంలోని ఆడకట్లన్ని వెతికారు. గ్రామ శివారులో సగం తినిన మృతదేహంగా బాబు కనిపించాడు. వెంటనే గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులకు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని స్థలాన్ని పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు బాబు మృతదేహాన్ని పరిశీలించి చిరుత పులి బాబును ఎత్తుకెళ్లి చంపి సగం తినేసిందని వెల్లడించారు. చిరుతను పట్టుకునేందుకు ఈ ప్రాంతంలో నాలుగు బోనులు ఏర్పాటు చేశామని ఎక్కడ అది బోనులో చిక్కలేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిరుతను పట్టుకునే వరకు జాగ్రత్తగా ఉండాలని గ్రామస్థులకు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News