- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి తక్కువగా ఉంది. బుధవారం శ్రీవారిని 16,498 మంది దర్శించుకున్నారు. 8296 మంది తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీకి రూ. 1.89 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు వెల్లడించారు. తిరుపతిలో ప్రతి రోజు ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను టిటిడి అధికారులు నిలిపివేశారు.
- Advertisement -