Thursday, March 28, 2024

కలిసి కట్టుగా ఎదుర్కొందాం: కపిల్‌దేవ్

- Advertisement -
- Advertisement -

kapildev

 

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కొందామని భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ పిలుపు నిచ్చారు. కరోనాను రూపుమాపేందుకు ప్రపంచం మొత్తం ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగితే కరోనా భూతంపై విజయం సాధించడం అసాధ్యం కాదన్నారు. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలువాలన్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా వృద్ధులను కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. ఇక, కరోనా వ్యాధికి మందు లేదని, సామాజిక దూరాన్ని పాటించడం ఒక్కటే మార్గమన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని విధిగా పాటించి కరోనాను తరిమి కొట్టాలని కపిల్‌దేవ్ కోరారు.

Lets faced Corona together
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News