Thursday, April 25, 2024

ఎల్‌ఐసి కొత్త జీవన్ శాంతి ప్లాన్

- Advertisement -
- Advertisement -

LIC New Jeevan Shanti Plan Launched

హైదరాబాద్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసి) బుధవారం కొత్త జీవన్ శాంతి ప్లాన్ ప్రారంభించింది. ఇది లింక్ చేయని, నాన్ పార్టిసిపెంట్, వ్యక్తిగత, సింగిల్ ప్రీమియం ప్లాన్. ఈ పాలసీ ప్రారంభం నుండి యాన్యుటీ రేట్లు హామీ ఇస్తాయి. వాయిదా వ్యవధి అనంతరం యాన్యుటీ తీసుకునేవారి మొత్తం జీవితకాల యాన్యుటీల చెల్లిం పు జరుగుతుంది. ఈ ప్లాన్‌ను 2020 అక్టోబర్ 21 నుండి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ ప్లాన్ కింద రెండు యాన్యుటీ ఎంపికలను ఎల్‌ఐసి అందిస్తోంది.

ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు, తాతలు, తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు మనవరాళ్ళు, జీవిత భాగస్వాములు లేదా తోబుట్టువుల మధ్య మాత్రమే ఉమ్మడి జీవిత యాన్యుటీ తీసుకోవచ్చు. ఈ పథకంలో కనీస కొనుగోలు ధర రూ.1,50,000. ఇది కనీస యాన్యుటీ ప్రమాణాలకు లోబడి ఉంటుం ది. యాన్యుటీ మోడ్ వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసి క, నెలవారీ అందుబాటులో ఉంది. కనీస యాన్యుటీ ఏడాదికి రూ.12,000. గరిష్ట కొనుగోలు ధర పరిమి తి లేదు. ఈ ప్లాన్‌ను దివ్యాంగ్జన్ ప్రయోజనం కోసం కనీసం రూ .50 వేల కొనుగోలు ధరతో కొనుగోలు చేయవచ్చు.

LIC New Jeevan Shanti Plan Launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News