మనతెలంగాణ/హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న బానోతు శ్రీనివాస్ బెడ్ షీట్తో ఆదివారం ఉదయం ఉరేసుకున్నారు. అనారోగ్యంతో రెండు రోజులుగా జైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.సూర్యాపేటలో 2019లో జరిగిన హత్య కేసులో శ్రీనివాస్కు నల్లగొండ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కిటికీకి ఉరేసుకున్న శ్రీనివాస్ను గమనించిన సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడని జైలు అధికారులు కుషాయిగూడ పోలీసులకు తెలిపారు. ఈక్రమంలో చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడటం సంచనలం రేపుతోంది. కాగా, ఖైదీ ఆత్మహత్యపై జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తనను కలిసేందుకు కుటుంబ సభ్యులు కూడా ఎవరూ రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు.
Life imprisonment prisoner suicide in Cherlapally Jail