Saturday, April 20, 2024

ఊళ్లలోనూ రస్తా బంద్

- Advertisement -
- Advertisement -

Villages

 

చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి స్థానికుల గస్తీ
రహదారులను స్వచ్ఛందంగా మూసివేస్తున్న స్థానికులు
రోజుకు రెండు సార్లు వీధులు పరిశుభ్రం

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో గ్రామాల్లోనూ జనజీవనం స్తంభించింది. ఆదివారం మొదలైన జనతా కర్ఫ్యూ తరహాలోనే గ్రామాల్లో కూడా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో రవాణవ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. గ్రామాల్లోకి అత్యవసరమైతే తప్ప వాహనాలను అనుమతించడం లేదు. గ్రామాల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కూలీ పనులకు సైతం వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు.

వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ అత్యవసరం కాకపోవడంతో రైతులు పొలానికి వెళ్లడం లేదు. గ్రామస్తులు ఊళ్లోకివచ్చే రహదారులను సైతం మూసివేస్తున్నారు. కొత్త వారు ఎవరూ గ్రామంలోకి రాకుండా అన్నివైపులా చెక్ పోస్టులు పెట్టి కాపలా కాస్తున్నారు. కొన్ని చోట్ల పక్క గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లోంచి ప్రయాణించడానికి కూడా అభ్యంతరం చెబుతున్నారు. సర్పంచ్, కార్యదర్శి అనుమతి లేనిదే గ్రామంలోకి కొత్త వారిని రానీయడం లేదు. మరోవైపు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించిన పంచాయతీ సిబ్బంది వారిని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా చూస్తున్నారు.

పారిశుధ్ధ్య పనులపై శ్రధ్ధ
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు జోరందుకున్నాయి. రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం వీధులను పరిశుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32వేల మంది పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో నిమగ్నమయ్యారు. పెద్ద గ్రామాలు, పట్టణాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. బైక్‌లపై అనవసరంగా తిరిగే వారిని పోలీసులు పట్టుకొని వాహనాలను సీజ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇళ్లు దాటి బయటకు రావద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే వారాంతపు సంతలు, మార్కెట్లు మూతపడ్డాయి. గ్రామంలోకి కొత్తవారు ఎవరు వచ్చినా వెంటనే సమాచారమి వ్వాలని జిల్లా అధికారులు గ్రామ సచివాలయాలకు సమాచారమిచ్చారు. పదిరోజుల వ్యవధిలో ఇతర రాష్ట్రాల నుంచి పలు గ్రామాలకు 3,546 మంది వచ్చినట్టు పలు గ్రామాల పంచాయతీ అధికారులు గుర్తించారు. దాదాపు 230 మంది విదేశాల నుంచి గ్రామాలకు వచ్చినట్టుగా తేలింది. వీరికి నిత్యం ఆరోగ్య పరీక్షలు జరుపుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

 

Life in Villages has been frozen with Lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News