Thursday, April 25, 2024

తిరుమలకు లైట్‌మెట్రో, మోనో రైలు

- Advertisement -
- Advertisement -

Tirumala

 

హైదరాబాద్ : తిరుమలకు లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్‌హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనిపై హైదరాబాద్ మెట్రో ఎండితో చర్చించి నివేదిక అడిగామని, భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని మెట్రో ఎండిని కోరామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఆగమ పండితులతో చర్చిస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏడుకొండల్లో టన్నెల్ తవ్వకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు నిర్మాణాన్ని పరిశీలించాలని కోరినట్లు ఆయన చెప్పారు. భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామ న్నారు. రోప్‌వేలు, కేబుల్ కార్లు లాంటివి వద్దని, తిరుమల పర్యావరణ పరిరక్షణకు మోనో రైలు ప్రతిపాదన ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రియాలో ఎత్తైన కొండపై మోనో రైలు వెళుతోందని దానిని మోడల్‌గా తీసుకొని తిరుమలకు రైలు ఏర్పాటును పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ట్విట్టర్‌లో జరుగుతున్న దుష్ప్రచారంపై వైవీ సీరియస్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరుతో టిటిడిపై ట్విట్టర్‌లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. అది అసలు అజిత్ దోవల్ ఖాతా కాదని, ఫేక్ ఎకౌంట్ అని తమ పరిశీలనలో తేలిందన్నారు. టిటిడికి చెందిన రూ. 2300 కోట్ల ధనాన్ని ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ భద్రతా సలహాదారు పేరుతోనే ఖాతాలు తెరిచి టిటిడిపై దుష్ప్రచారం చేయడాన్ని సహించేది లేదన్నారు. నకిలీ ఖాతాలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతామని, త్వరలో సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

Light Metro and Mono Train to Tirumala
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News