- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోఎట్టకేలకు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇకేముంది.. కిలోమీటర్ల పొడువునా మందబాబులు బారులు తీరారు. దాదాపు 45 రోజులపాటు మందు లేక అవస్థపడుతున్నవారంతా ఈరోజు తెల్లవారుజాము నుంచే వైన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట మద్యం ధరలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఈరోజు నుంచి వైన్ షాపులను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవనున్నారు.
Liquor shops opened in AP
- Advertisement -