Tuesday, April 23, 2024

ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

Hospital facility at mahaboobnagar
హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని, ప్రజలను అనవసరంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగనట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, ప్రతిపక్ష నేతలకు మతిభ్రమించిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి డిపాజిట్ కోల్పోయిందని, తెలంగాణ ప్రజలు ఎవరివైపు ఉన్నారో గమనించాలన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో సిఎం కెసిఆర్ ఉన్నారన్నారు. రాష్ట్ర బిజెపి, కాంగ్రెస్ నేతలు తెలంగాణ బాగు ఏనాడూ కోరుకోలేదని, సిఎం కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News