Thursday, April 25, 2024

లోన్ యాప్ వేధింపులతో యువకుడు బలి

- Advertisement -
- Advertisement -

 

లోన్‌ యాప్స్‌ వేధింపులతో మరణిస్తున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది. అవసరానికి డబ్బు తీసుకుని, తిరిగి కట్టలేక వేధింపులతో ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే. చెల్లించినా వేధింపులు తప్పక ఆత్మహత్యలకు పాల్పడుతోన్న వారు మరికొందరు. చిత్తూరు జిల్లాలో యువకుడు లోన్‌ యాప్‌ వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే. చిత్తూరు జిల్లా పెనుమూరు అంబేద్కర్ కాలనీకి చెందిన యువకుడు జానకీరాం. లోన్ యాప్‌లో 80వేలు రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. కొంత కాలం బాగానే చెల్లించినా ఆ తర్వాత చెల్లింపులు చేయడం కష్టంగా మారింది. అయితే, లోన్‌ యాప్‌ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ప్రాణం తీసుకున్నాడు. అవసరాలకు రూ. 80 వేలు అప్పుగా తీసుకున్నాను. తిరిగి కట్టలేక పోయాను వాళ్లు నన్ను వేధిస్తున్నారు.

ఈ బాధను భరించలేకపోతున్నా. ఆత్మహత్య చేసుకుంటున్నా. నన్ను క్షమించండి అంటూ సూసైడ్‌ నోట్‌ రాసుకొచ్చాడు . రూ. 80 వేల ఆన్‌లైన్‌ అప్పును మేనేజ్‌ చేయడం నా వల్ల కావడంలేదు. అమ్మ నన్ను క్షమించు, కేవలం ఈ అప్పు కోసమే చనిపోతున్నాను, ఇంకా ఎవరికోసమో కాదు. అలాంటి ఉద్దేశం ఏమీలేదు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. అంటూ జానకీరాం సూసైడ్‌ నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News