Tuesday, April 23, 2024

ముంబైలో లోకల్ ట్రైన్స్ ప్రారంభం.. వారికోసం మాత్రమే..

- Advertisement -
- Advertisement -

Local Trains Resume Services in Mumbai

ముంబయి‌: దేశ ఆర్థిక రాజధాని ముంబయి న‌గ‌రంలో సోమవారం నుండి లోకల్ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, ఈ రైళ్లు ప్రభుత్వ రంగంలో అవసరమైన సేవా కార్మికుల కోసం మాత్రమే నడపనున్నట్లు సెంట్రల్ అండ్ వెస్ట్ర‌న్ రైల్వేతోపాటు బృహన్ముంబయి మున్సిపల్ కార్పోరేషన్(బిహెచ్ఎం) ప్రకటించింది. రెండు నెలల వరకు ఈ రైళ్ల‌లో సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి లేదని తెలిపింది. విరార్, దహాను మధ్య ఉన్న రూట్లో ఎక్కువ సంఖ్య‌లో రైళ్లు న‌డ‌వ‌నున్న‌ట్లు రైల్వేశాఖ తెలిపింది.  ఉదయం 5.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకు సుమారు 15 నిమిషాల విరామంతో ఈ రైళ్లను నడుపనున్నట్లు పేర్కొంది.

Local Trains Resume Services in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News