Saturday, April 20, 2024

లాక్‌డౌన్‌ సత్ఫలితాలు ఇస్తోంది: సిఎం కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

lockdown extension in delhi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించింది. మరో వారం పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని సిఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు 35 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో నిన్న 17,364 కేసులు నమోదయ్యాయి.

lockdown extension in delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News