హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సైతం లాక్డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించడం, రాష్ట్ర హైకోర్టు సైతం లాక్డౌన్ నిర్ణయం తీసుకోవడంతో తమ కమిషన్ కార్యాలయం సైతం అప్పటీ వరకు లాక్డౌన్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. అయితే అత్యవసర ఫిర్యాదులను ఈ-మెయిల్ informationcell.tshrc@gmail.com ద్వారా స్వీకరించడం, క్యాంప్ ఆఫీసు నుంచి ఇందుకు సంబంధించి ఆదేశాలను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 14వ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు లాక్డౌన్ కొనసాగించడమా, లేక ఎత్తివేయడమే అనేది నిర్ణయించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు. న్యాయవాదులు, మరింత సమాచారం కోసం కార్యాలయం పని వేళ్లలో సెల్ నంబర్లు 9963141253, 9000264345 ద్వారా సంప్రదించవచ్చన్నారు.