Thursday, April 25, 2024

మహబూబ్‌నగర్‌లో లారీ బీభత్సం.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్‌ః జిల్లాలో కేంద్రంలో లారీ బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైకుతోపాటు ప్రతిభ కళాశాల బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, కళాశాల బస్సు డ్రైవర్ గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన వ్యక్తిని మహబూబ్‌నగర్‌కు చెందిన సత్యనారాయణ(60)గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News