Friday, April 26, 2024

డిసిఎంను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

దేవరకద్ర: మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ నుంచి రైచూర్ వెళ్తున్న లారీ ఆగి ఉన్న డిసిఎం ఢీకొట్టడంతో డిసీఎం ముందున్న విషయం భగీరథ పైపులైన్ హాల్ విరగడంతో వెంటనే విద్యుత్ లైన్ నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న డీసిఎంను బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ శామ్యూల్(38) అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆగి ఉన్న డీసీఎంలో డ్రైవర్ నిద్రపోతున్న డ్రైవర్ అప్రమత్తతో బయటికి వచ్చి వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకద్ర ఎస్‌ఐ భగవంత్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News