ఛండీగఢ్: ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జగ్రూప్ సింగ్(24) అనే దివ్యాంగుడు, రజ్వీందర్ కౌర్ (19) అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. కౌర్ మాత్రం గత కొంత కాలం నుంచి తన కుటుంబంతో కలిసి ఉండడంలేదు. సింగ్ను కుటుంబం పట్టించుకోకపోవడంతో విడిగా ఉంటున్నాడు. తన మేనమామ దగ్గర పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఝిందార్ గ్రామ శివారులో దుప్పెట సహాయంతో ఓ చెట్టుకు సింగ్, కౌర్ ఉరేసుకున్నారు. చెట్టుకు ఇద్దరు ఉరేసుకొని కనిపించడంతో గ్రామస్థులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించామని పోలీస్ అధికారి అవతార్ సింగ్ కహ్లోన్ తెలిపాడు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చిన తరువాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.