- Advertisement -
అమరావతి: టిక్టాక్లో పరిచమైన యువతి యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లి బెదిరించడంతో ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా బెల్లంకొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మునుగోడుకు చెందిన పవన్ కుమార్కు (19), చిత్తూరు జిల్లా కోటగుడిబండ మండలం గుదిబండ గ్రామానికి చెందిన కూటాల రవీంద్ర కుమార్తె శైలజ(18) టిక్టాక్లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి తిరుపతిలో వివాహం చేసుకొని కందిపాడులో ఉంటున్నారు. యువకుడి మేనమాయ కందిపాడుకు వచ్చి ఆ ప్రేమజంటను మాచాయపాలెంలో ఉంచాడు. శైలజ తమ ప్రేమ పెళ్లి విషయం కువైట్లో ఉన్న తల్లి చెప్పడంతో ఆమె చంపేస్తానని బెదిరించింది. భయంతో గురువారం సాయంత్రం ఆ ప్రేమ జంట ఫ్యాన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
- Advertisement -