Friday, April 19, 2024

వివాహిత, ప్రియుడు ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

Love couple commit suicide in Nagar Kurnool

నాగర్‌కర్నూలు: ఓ వివాహిత, తన ప్రియుడితో లేచిపోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పదిర మండలం మద్దిమడుగు గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో ఓ యువకుడు (30), యువతి(28) ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమ విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియడంతో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల కింద యువతి నాలుగేళ్ల కుమారుడిని తీసుకొని ప్రియుడితో పారిపోయింది. రెండు కుటుంబాలు వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ కనిపించలేదు. మద్దిమడుగు గ్రామ శివారులో ఆ జంట చేరుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని వెతకగా ఎక్కడ కనిపించలేదు. కొంచెం దూరంలో పొదల మధ్య నుంచి బాలుడి ఏడుపు శబ్ధం వినపడడంతో అక్కడికి వెళ్లి చూడగా ప్రేమ జంట మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News